15 June, 2026 | 10:40 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

30-12-2025 01:36 AM

రూ.50వేలు జరిమానా 

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 29 : భూవివాదంలో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50వేలు జరిమానాను కోర్టు విధించింది. నంగునూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన రేకులపల్లి సురేందర్ కిరాణా దుకాణం నిర్వహించేవాడు. దుకాణం వద్ద పన్నెండు గంటల భూమి విషయంలో అతడి దాయాది రేకులపల్లి శ్రీనివాస్ తరుచూ గొడవపడేవాడు.

ఈ క్రమంలో మనసులో కక్ష పెంచుకున్న శ్రీనివాస్ ఇనుప రాడ్ తో సురేందర్ తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావం అయింది. ఈ విషయమై సురేందర్ కుమారుడు శ్రీనివాస్ రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్రీనివాస్ ను కోర్టులో హాజరు పరిచారు.

కేసు దర్యాప్తు దశలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేందర్ మృతి చెందాడు. సోమవారం సిద్దిపేట ఒకటో అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జి జయప్రసాద్ ఇరుపక్షాల వాదనల అనంతరం నిందితుడు శ్రీనివాస్ పై నేరం రుజువు కావడంతో తుది తీర్పు వెల్లడించారు.