10-02-2026 12:00:00 AM
బూర్గంపాడు, ఫిబ్రవరి9, (విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని సారపాక గ్రామంలో ఏఐటీయూసీ కార్యాలయం నందు నూతనంగా ఎన్నికైన సారపాక సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్, ముసలిమడుగు సర్పంచ్ పూనెం సురేంద్ర లను ఐఎన్ టియుసి కాంట్రాక్టు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని విధాలుగా కార్మికులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
అదేవిధంగా జరగబోవు వేతన ఒప్పందంలో కూడా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఈ ఎస్ ఐ హాస్పిటల్ కొరకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని కార్మికులకు అన్ని విధాలుగా తోడుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి కాంట్రాక్ట్ యూనియన్ అధ్యక్షులు ఉర్లకొండ వీరన్న, ప్రధాన కార్యదర్శి పాటి సోమిరెడ్డి , శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.