16-06-2025 12:00:00 AM
కామారెడ్డి, జూన్ 15,(విజయక్రాంతి): సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం ఆదివారం కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోట లో గడి కోట వారసులు కామినేని అనిల్ ఆధ్వర్యంలో సరస్వతి పూజ నిర్వహించారు. అనంతరము చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కామినేని అనిల్, రాజేశ్వర్ రావు , 2025 సంవత్సరం లో 10 వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు మొదటి ఇద్దరు విద్యార్థులు సుమయ,నవదీప్ లకు 25,000 వేల చొప్పున నగదును అందజేశారు.
తర్వాత విద్యార్థులకు సన్నిహిత -20,000, రేవతి- 18,000, రాహుల్ 15,000 చొప్పున స్కాలర్షిప్లను అందజేశారు. దోమకొండ గ్రామ విద్యార్థులకు ప్రోత్సాకంగా ఇస్తున్న స్కాలర్షిప్లను అభినందిస్తూ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ , కామినేని అనిల్ ని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ , సొసైటీ చైర్మన్ పన్యాల నాగరాజు , మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్ , అంగన్వాడి సూపర్వైజర్లు, టీచర్లు, ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, ప్రజా ప్రతినిధులు, గణేష్ యాదవ్ రాజశేఖర్,ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.