02-12-2025 12:14:16 AM
బూర్గంపాడు, డిసెంబర్1 (విజయక్రాం తి): దాదాపు పాతికేళ్ల తర్వాత తమ స్నేహితులు, చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ సందడిగా గడిపారు.భద్రాద్రి కొత్తగూడెం జి ల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని సెయింట్ తెరిసా పాఠశాలలో 1991-2001 సంవత్సరం(సిల్వర్ జూబ్లీ)కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ వి ద్యార్థులను చూసి గురువులు ఆనందించా రు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభినాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకున్నారు. విద్యార్ధినీ విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్ధి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.