హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుంది
ఎస్పీ నితికా పంత్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ పట్టణంలో నిర్వహించిన ఫుట్ పెట్రోలింగ్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను అభినందిస్తూ ఇలాంటి వారే బెస్ట్ సిటిజన్స్ ఇన్ ఆసిఫాబాద్ అని కొనియాడారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ అశోక్, టౌన్ ఇన్స్పెక్టర్ బాలాజీ వరప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేష్, వేణుగోపాల్, ఎస్త్స్రలు మధుకర్, రవికుమార్, విక్రమ్, మహేందర్, ఉల్లాస్, శ్యామ్ రామ్, మోహన్ కుమార్, పోలీసు , స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.






