ప్రభుత్వ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ
04-06-2026 02:29 AM
నేరేడుచర్ల, జూన్ 3: 2026- 27 విద్యా సంవత్సరానికి గాను మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బుధవారం ఉచిత పాఠ్య పుస్తకాలు మొత్తం 11,645, నోట్ పుస్తకములు మొత్తం 11,235 మండల వనరుల కేంద్రంలో మండల విద్యాధికారి ఎం .బాలు నాయక్ ఆధ్వర్యంలో ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులకు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులందరికీ ఉచిత పార్టీ పుస్తకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జి. హెచ్.ఎం ప్రధానోపాధ్యాయులు పి.సత్యనారాయణ రెడ్డి.బి .మధు, ఎల్.శ్రీనివాసరావు రవీందర్ రెడ్డి, ఎం ఆర్ సి సిబ్బంది పి .ప్రతాప్ ,బి .నాగేందర్ మరియు సీఆర్పీలు కే .శ్రీనివాస్ రెడ్డి, వై .ప్రవీణ్, ఎం . పద్మ తదితరులు పాల్గొన్నారు.






