31-05-2025 02:35:01 AM
పీసీసీ వర్కింగ్ ప్రెసెడెంట్ జాగ్గారెడ్డి
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ చరిత్రకు, బీజేపీ చరిత్రకు వందేళ్ల తేడా ఉందని, కాంగ్రెస్ 1885లో ఆవిర్భవిస్తే.. బీజేపీ పుట్టి కేవలం 45 ఏళ్లు మాత్రమే అవుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు తప్పుగా మాట్లాడటం సరికాదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వేసిన మొట్టికాయలకు ఎంపీ రఘునందన్రావు మైండ్ బ్లాక్ అయిందని, అందుకే చరిత్రను వక్రీకరించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రఘునందన్ హద్దులు దాటి మాట్లాడుతున్నారని, రాహుల్గాంధీ చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. బీజేపీకి ఎజెండా లేదని, కాంగ్రెస్ సముద్రంలోని ఒక బిందే నీళ్లు తీసుకుని జీవిస్తున్నారని, ఆ బిందెడు నీల్లే సర్దార్ వల్లాబాయ్ పటేల్ అని విమర్శించారు. కశ్మీర్ రాజు ఇండియన్ గవర్నెమెంట్లో కలిసేందుకు సిద్దపడినప్పటికీ అక్కడి ప్రజలు వ్యతిరేకించారన్నారు. అందు కే కశ్మీర్ భారత్లో ఉండేలా ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.
కోమటిరెడ్డి పేరు ఉంటే బాగుండేది..
ఏఐసీసీ నియమించిన పీసీసీ కమిటీల కూర్పు చాలా బాగుందని, సామాజిక న్యా యం పాటించారన్నారు. కానీ పీఏసీ కమిటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేరు పెడితే బాగుండేదని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తనకు ఏ కమిటీలో ఇచ్చినా సంతోష మేనని, గాంధీభవన్కు అటెండర్ పోస్టు ఇచ్చినా పని చేస్తానని తెలిపారు. జానారెడ్డి ఉన్న కమిటీలో తనకు అవకాశం ఇచ్చారంటే ప్రమోషన్ ఇచ్చినట్లే కాదా అని పేర్కొన్నారు.