20 July, 2026 | 5:09 PM

Breaking News

చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •   తల్లిదండ్రుల త్యాగమే విద్యార్థుల విజయానికి పునాది: స్ఫూర్తి ఫౌండేషన్   •   కొడంగల్‌లో సీఎం రేవంత్ రెండు రోజుల పర్యటన   •   బోధన్ మధు మలంచ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల దుస్థితి   •   నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి రాజీనామా చేయాలి: సిఐటియు డిమాండ్   •   ఐలాండ్ నిర్మాణ పనుల్లో నాణ్యత కరువు..!   •   పసి పిల్లలకు తొలి ముద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు   •   సింగరేణి అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి   •  

రేవంత్‌కు గుణపాఠం తప్పదు

20-07-2026 12:08 AM

గజ్వేల్ మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ 

గజ్వేల్, జూలై 19: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే ప్రజల నుంచి గుణపాఠం తప్పదని గజ్వేల్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రతి వేదికపై కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడమే ముఖ్యమంత్రి పనిగా మారిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పోషించిన పాత్రను ప్రజలు ఎన్నటికీ మరచిపోరని, ఆయనను తెలంగాణ ప్రజల హృదయాల నుంచి ఎవరూ చెరపలేరని అన్నారు.

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందనే విమర్శల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు, నేతన్నలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కరవు పరిస్థితులు, శాంతిభద్రతల అంశాలపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసి రాష్ట్ర సాధనలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని, అలాంటి నాయకుడిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని, కేసీఆర్కు మద్దతుగా తెలంగాణ ప్రజలు నిలుస్తారని మాదాసు శ్రీనివాస్ అన్నారు. అలాగే కేసీఆ్ప అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే తెలంగాణవాదులు ప్రజాస్వామ్యబద్ధంగా స్పందిస్తారని హెచ్చరించారు.