26 April, 2026 | 11:14 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

‘డొంగ్లీ’కి కొత్తగా ప్రజా పరిషత్

29-11-2024 12:28 AM

కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాల్లో మండల ప్రజా పరిషత్ కార్యాలయాల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిలో భాగంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ ఉమ్మడి మండ లం నుంచి వీడిపోయి, మండలంగా ఏర్పడిన డొంగ్లికి కూడా ప్రజాపరిషత్‌కు అనుమతులు వచ్చాయి.

ఇదే నియోజకవర్గంలో మరో మండలంగా ఏర్పడిన మహమ్మద్‌న గర్‌లోనూ ప్రజాపరిషత్ అందుబాటులోకి రానున్నది. దీంతో నియోజ కవర్గంలో మొత్తం ఎనిమిది మండలాలకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ఎనిమిది ఎంపీపీలు, ఎనిమిది జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.