calender_icon.png 30 May, 2025 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 30న పోషకుల సమావేశం నిర్వహించాలి

29-05-2025 07:54:31 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మే నెల 30న శుక్రవారం రోజున ఉదయం పోషకుల సమావేశాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఏర్పాటు చేయాలని జిల్లా ఇన్చార్జ్ విద్యాశాఖ అధికారి ముడారపు పరమేశ్వర్(Education Officer Mudarapu Parameshwar) తెలిపారు. ఈ సమావేశానికి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులందరినీ ఆహ్వానించాలని సూచించారు. వారితో పాటు గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులలోని యువతీ యువకులను, స్థానిక ప్రజాప్రతినిధులను, నాయకులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని కోరారు. ఈ సమావేశంలో బడి బాట కార్యక్రమం, పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపుదల తదితర అంశాలపై చర్చించి తీసుకోవాల్సిన చర్యల కొరకు కార్యచరణ కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని సూచించారు. ఈ సమావేశానికి పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు.