calender_icon.png 30 May, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల్లో బీజేపీ పైచేయిగా నిలవాలి

29-05-2025 08:00:17 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అత్యధిక స్థానాల్లో విజయం సాధించి పైచేయి సాధించాలని, ఇందుకోసం పార్టీ క్యాడర్ సన్నద్ధం కావాలని మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు(District President Vallabu Venkateswarlu) పిలుపునిచ్చారు. కేసముద్రం మండల కేంద్రంలో గురువారం జరిగిన ఆ పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే బూత్ లెవెల్ నుంచి పట్టణం వరకు పార్టీ సంస్థగా పటిష్టంగా రూపొందిందని, ఇదే స్ఫూర్తితో ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేయాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను పూర్తిగా తుంగలోకి తొక్కిందని, ప్రజలు ఆ పార్టీ నేతల మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్యాంసుందర్ శర్మ, మహేష్ గౌడ్, వెంకన్న, ధర్మారెడ్డి, సతీష్, పొదిల నరసింహారెడ్డి, అశోక్, తుంపిల్ల శ్రీనివాస్, పూర్ణచందర్ రెడ్డి, సందీప్, ఉప్పునూతల రమేష్, బోగోజు నాగేశ్వర చారి, కొండపల్లి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.