మురుగునీటి దుర్గంధానికి శాశ్వత పరిష్కారం
* మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్
అమీన్ పూర్, మార్చి 10: బీరంగూడ డి విజన్ పరిధిలోని జయలక్ష్మి నగర్, లక్ష్మి సా యి మెడోస్ కాలనీ మీదుగా వెళ్తున్న ప్రధాన మురుగు నీటి కాలువ మూలంగా వెలబడుతున్న దుర్వాసన సమస్యకు శాశ్వత పరి ష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నం దారం నరసింహ గౌడ్ తెలిపారు. ఇటీవల రెండు కాలనీల ప్రజలు నందారం నరసిం హా గౌడ్ ని కలిసి కాలువను శుభ్రపరచకపోవడంతో ప్రతిరోజు భరించలేని దుర్వాసన తో పాటు దోమల సమస్యను ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన నందారం నరసింహా గౌడ్ అమీన్ పూర్ మున్సిపాలిటీ డీఈ వెంకటరమణకు సమస్యను వివరించారు. మంగళ వారం సంబంధిత అధికారులతో కలిసి స్వ యంగా రెండు కాలనీలలో నరసింహ గౌడ్ పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న స మస్యను అధికారులకు స్వయంగా చూపించారు. కాలువలను వెంటనే శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని అధికారులకు విన్నవించారు. అతి త్వరలో సమస్యను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.






