కుష్టు వ్యాధి నివారణకు ప్రతిజ్ఞ
05-02-2025 05:52 PM
భైంసా (విజయక్రాంతి): కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మిద్దామని బుధవారం కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కుష్టు వ్యాధి నియంత్రణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అమృత రాణి, సవితా, విజయలక్ష్మి, జ్యోతి, అరుణ తదితరులు ఉన్నారు.






