10 May, 2026 | 6:31 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి

10-05-2026 05:15 PM

మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య

తుంగతుర్తి,(విజయక్రాంతి): హైదరాబాద్ లో మైనర్ బాలిక ను నమ్మించి మోసం చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ ను వెంటనే అరెస్ట్ చేయాలి. వేధింపులకు గురి అయినటువంటి యువతి కి ప్రభుత్వం అన్ని విధాల న్యాయం చేయాలని మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. ఆదివారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ఉన్న చాటు మాటు రాజకీయ సంబంధంతో కేంద్రమంత్రి బండి సంజయ్ కేసును నిరుగార్చాలని చూస్తున్నారని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని. నేరస్తున్ని చట్ట పరిధిలో శిక్షించాలని డిమాండు చేస్తున్నాం.. మైనర్ బాలిక కు న్యాయం జరిగే వరకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు సోమేష్. రమేష్. నాగమల్లు. వెంకటేష్ లతీబ్. గోపగాని వెంకన్న. చింతకుంట్ల సురేష్. కొల్లూరి మహేందర్. ఆకారపు భాస్కర్ పాల్గొన్నారు..