22 August, 2026 | 2:56 PM

Breaking News

ఆర్ఓబి బ్రిడ్జి నిర్మాణంపై అవగాహన కార్యక్రమం   •   ఆశ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి   •   జగన్నాథ ఆలయంలో హైకోర్టు జడ్జి ప్రత్యేక పూజలు   •   అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   బెల్లంపల్లిలో జూనియర్ సివిల్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి   •   డాక్యతాండలో ఘనంగా సామూహిక కుంకుమార్చనలు   •   ప్రజలను ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం సరికాదు   •   జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ నిరసన దీక్ష   •   వెంకటరామిరెడ్డి విగ్రహం నెలకొల్పాలని ఏకగ్రీవ తీర్మానం   •   మైలారం యంగ్ ఇండియా పాఠశాల పనులు వేగవంతం చేయాలి   •  

దాహార్తి తీర్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం

14-04-2025 05:33 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి ఎద్దడి తీర్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చిత్రపటానికి సోమవారం ఆ కాలనీవాసులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల ఈ కాలనీలో నీటి ఎద్దడి తీవ్రం కాగా స్థానికులు చేసిన విన్నపం మేరకు స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ నిధులలో నుంచి రెండు బోర్లు వేయించి సాగునీటి వసతి కల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం దాహార్తి తీర్చిన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కు స్థానికులు ఈ విధంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు.