calender_icon.png 9 June, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అ‘పూర్వ’ వేడుక

09-06-2025 12:35:44 AM

కరీంనగర్, జూన్ 8 (విజయ క్రాంతి): 20 ఏండ్ల తర్వాత ఆ విద్యార్థులంతా కలుసుకున్నారు.. పది తర్వాత తమ చదువులు, జీవితాల్లో స్థిరపడేందుకు పడ్డ కష్టాలను ఒకరికొకరు చెప్పుకొన్నారు. బడిలో చిన్ననాటి అనుభవాలను నెమరు వేసుకొన్నారు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయులు, తమ మిత్రులతో అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు.   ఉపాధ్యాయులు సత్యం, లక్ష్మణ్, సత్యనారాయణ,  సుధాకర్, శాస్త్రి, శ్రీనివాస్ కు విద్యార్థులుపాదపూజచేశారు.