09-06-2025 12:35:57 AM
మహబూబాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): పెళ్లి వేడుకలో తమకు 5 వేల రూపాయలు నజరానా ముట్ట చెప్పాలంటూ హిజ్రాలు రభస సృష్టించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతుండగా ఫంక్షన్ హాలు లోకి ప్రవేశించిన హిజ్రాలు ఐదువేల రూపాయలు ఇస్తే తప్ప ఇక్కడ నుంచి కదిలి లేదని భీష్మించారు.
అయితే తాము అంత ఇచ్చుకోలేమని వెయ్యి రూపాయలు ఇస్తామని వరుడి తరఫు బంధువులు హిజ్రాలకు చెప్పగా, 5 వేలు ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ నానా యాగి చేయడం ప్రారంభించారు. దీనితో పెళ్లి వేడుకలో రసాభాస చోటు చేసుకోవడంతో వరుడి బంధువులు 100కు డైల్ చేసి ఫిర్యాదు చేశారు. హిజ్రాల చేష్టల పై వధువరుల దంపతులు విసుగుచెంది చివరకు ఎదురు తిరగడంతో పాటు పోలీసులు వస్తున్నారని తెలుసుకొని అక్కడి నుండి హిజ్రాలు పలాయణం చిత్తగించారు.