06-02-2026 12:00:00 AM
నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ చిన్నఆత్మకూరు గ్రామంలో పౌర సరఫరా (రేషన్) దుకాణం ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరారు. గ్రామస్తుల మేరకు గురువారం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) పార్థసింహారెడ్డికి వినతిపత్రం గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డిలు సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య, మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న ఆత్మకూరు గ్రామంలో రేషన్ దుకాణం లేకపోవడంతో గ్రామ ప్రజలు నిత్యావసర సరుకుల కోసం వేరే గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనివల్ల వృద్ధులు, మహిళలు, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చిన్నఆత్మకూరు గ్రామంలో వెంటనే పౌర సరఫరా దుకాణం ఏర్పాటు చేయాలని ఆర్డీఓను కోరారు. దీనిపై స్పందించిన ఆర్డీఓ పార్థసింహారెడ్డి సానుకూలంగా స్పందించి, త్వరలోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్రెడ్డి ఉన్నారు.