calender_icon.png 6 June, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలం మెచ్చిన ప్రజానాయకుడు!

30-05-2025 01:34:29 AM

తండ్రి చూపిన బాటలో నడు స్తూ, ఆయన ఆశయ సాధనకు నిరంతరం శ్రమిస్తున్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. మంథని నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారు.

ఒకవై పు మంత్రిగా విరామం ఎరగకుండా గంటలకొద్ది తెలంగాణ అభ్యున్నతికి కంకణబ ద్ధులై పని చేస్తున్నారు. మరోవైపు నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉం టూ, వారికి అంకితమైన నాయకుడిగా గు ర్తింపు సాధించారు.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అనుగుణంగా తెలంగాణను ప్రపం చ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా రు.

శాసనసభ వ్యవహారాలను చక్కదిద్దడంలో దిట్టగా పేరు సంపాదించుకున్నా రు. రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వారు ఉండరు. మంథని నియోజక వర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 

మంథని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నేతగా శ్రీధర్‌బాబు గుర్తింపు పొం దారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్రను నిర్వహిస్తున్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.

శ్రీధర్ బాబు 1969 మే 30న జన్మించారు. తండ్రి ప్రముఖ కాంగ్రెస్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు. తల్లి జయమ్మ. వీరి మూడో కుమారుడు శ్రీధర్ బాబు. ఢిల్లీ విశ్వవిద్యాలయం లో న్యాయవాద విద్యను అభ్యసించారు. 1998లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు.

1999లో తండ్రి శ్రీపాదరావు హత్య అనంతరం వారి రాజకీయ వారసునిగా రాజకీయాల్లో అడుగు పెట్టారు. విద్యార్థిగా మంచి క్రికెటర్. ఆయ న నిజాం కళాశాల, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తెలంగాణ కేడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి శైలజా రామయ్యర్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా..

1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి తన అనుచర వర్గంతో వెళుతుండగా, నక్సలైట్లు (పీపుల్స్‌వార్ గ్రూప్) ఆయన వాహ నాన్ని ఆపి, మాట్లాడాలని చెప్పి అడవిలోకి తీసుకెళ్లి తుపాకీతో కాల్చి చంపారు. ఈ దుర్ఘటన రాజకీయ వర్గాల్లో, మంథని ప్రజ ల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

దుద్దిళ్ళ శ్రీపాదరావు మంథని నియోజక వర్గంలో అభివృద్ధి పరిమళాలను వెదజల్లిన నాయకుడిగా, శాసనసభ స్పీకర్‌గా నిష్పక్షపాతం గా వ్యవహరించిన వ్యక్తి. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేతగా నూ గుర్తింపు పొందారు. ఆయన విషాదకర మరణం రాజకీయ వర్గాల్లో, మంథని ప్రజల్లో శూన్యతను సృష్టించినప్పటికీ వారి కుమారుడు శ్రీధర్‌బాబు తండ్రి ఆశయాలను, సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్నా రు.

శ్రీపాదరావు సేవలు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక అమర గాథగా నిలిచిపోయాయి. శ్రీపాదరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా వ్యవహరించారు. ఆయన స్పీకర్‌గా ఉన్న సమయంలో అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రశంసలు అందుకున్నారు. వారి నిర్వహణలో శాసనసభ పనితీరు అభివృద్ధి పరిమళాలను వెదజల్లిందని విశ్లేషకులు అభివర్ణిస్తారు. 

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించారు. డిసెంబర్ 7న రేవంత్‌రెడ్డి మంత్రివ ర్గంలో శ్రీధర్ బాబు ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఆయన రంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.

మంథనిని రాష్ట్రంలోనే అత్యుత్తమ నియోజక వర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. మంథని నియోజక వర్గం లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, తాగునీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాల మెరుగుదలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్ల నిర్మాణం, విస్తరణకు గణనీయంగా నిధు లు వెచ్చించారు. 2004- 2014 మధ్య ఆయన హయాంలో రోడ్ల నిర్మాణంతోపాటు గ్రామీణ మౌలిక వసతుల కోసం వందలాది కోట్లు ఖర్చు చేశారు.  

అభివృద్ధిలో అగ్రగామిగా.. 

మంథనిలో పరిశ్రమల స్థాపన, స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ప్రపంచ స్థాయిలో మంథని మేధస్సుకు చి హ్నంగా నిలవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా ఆయన చేపట్టిన చర్య లు మంథనిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాయి.

ఈ నియోజక వర్గం శ్రీధర్ బాబు నాయకత్వంలో మహర్దశను సంతరించుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతు ల కల్పన, విద్యాసంస్థల స్థాపన, ఆరోగ్య సేవల మెరుగుదల, రైతుల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంథనిని అభివృద్ధికి చిరునామాగా మార్చాయి. పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులను ఆకర్షించ డం ద్వారా మంథని ఆర్థిక వృద్ధికి బాటలు వేశారు. పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్‌గా నిలుస్తోంది.

దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తు న పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ బృందం అమెరికా, దక్షిణ కొరియా, దావోస్, జపాన్ పర్యటనతో తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చింది. 

సీఎం రేవంత్‌రెడ్డి రెండుసార్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ సందర్శించారు. సీఎం వెంట ఐటీ పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు కూ డా వెళ్లారు. పలు ఒప్పందాల సందర్భంగా ఆయన కీలక పాత్ర పోషించారు.

పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేందుకు ముఖ్యమంత్రితోపాటు మంత్రి శ్రీధర్‌బాబు ప్రపంచ పారిశ్రామిక వేత్తలను ఒప్పించి, మెప్పించడం విశేషం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడుగులో అడుగు వేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. 

భావితరాల అవసరాలు తీర్చేలా..

2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్- కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తీసుకురావడం ద్వా రా రాష్ట్ర జీడీపీని ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని శ్రీధర్ బాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అ నుకూల విధానాలు ఉండటం వల్ల ప్రము ఖ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి.

ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తోంది. హైద రాబాద్‌లో ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసే లక్ష్యంతో, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు. ఇది భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ, సెమీ కండక్టర్, హెల్త్‌కేర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కఠోరంగా శ్రమిస్తున్నారు.

ఐటీ పార్కుల ఏర్పాటు, నైపుణ్య శిక్షణా కేంద్రాల స్థాపన, ద్వితీయ శ్రేణి నగరాల్లో ఉద్యోగ కల్పన, స్టార్టప్‌ల ప్రోత్సా హం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు లక్షలాది ఉపాధి అవకాశాలను సృష్టి స్తున్నారు. ఈ ప్రణాళికలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

రాజకీయాల్లో మంత్రి శ్రీధర్‌బాబు ఒక లెజెండ్. యువతకు నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి అవకాశాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత ఉన్నతమైన సేవలందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఆయన సంకల్పం నెరవేరి రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలవాలని కోరుకుందాం. 

వ్యాసకర్త సెల్: 9441884389