20-02-2026 01:19:02 AM
నిర్మల్, ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి): జిల్లాకు చెందిన సౌజన్య, రాకేశ్ దంపతుల కుమారుడు ఆదిత్య కేవలం 19 నెలల వయసులోనే 50 మీటర్ల దూరాన్ని 36 సెకన్లలో పూర్తి చేసి అరుదైన ప్రతిభను చాటుకున్నాడు.
ఈ అసాధారణ ప్రతిభకు గాను బాలుడు నోబెల్ వరల్డ్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్సు సంస్థల నుండి ‘సూపర్ టాలెంటెడ్ కిడ్’ అవార్డులు అందుకున్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తన ఛాంబర్లో బాలుడిని, అతని తల్లిదండ్రులను శాలువాతో సన్మానించి అభినందించారు.