9 April, 2026 | 2:58 PM

నీట్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

29-06-2024 12:35 AM

మాజీ ఎంపీ వినోద్‌కుమార్ డిమాండ్

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి) : నీట్ పేపర్ లీకేజీపై నిరస నలు ఉధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ బీవినోద్‌కుమార్ విమర్శించారు.  నీట్‌ను రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన ట్లుగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని డిమాండ్ చేశారు.  గతంలో మాదిరిగా ఎంసెట్ ఆధారంగానే మెడికల్ అడ్మిషన్లు చేపట్టేం దుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాం డ్ చేయాలని కోరారు.