30-06-2025 02:35:34 AM
ఎల్లారెడ్డి, జూన్ 29,(విజయ, క్రాంతి ): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో సామాజిక సేవకు మరో ముందడుగు పడింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ గ్రామ అధ్యక్షుడు జిలకర సత్యనారాయణ తన సొంత ఖర్చుతో గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రానికి రంగులు వేయించారు. ఆదివారం ,తన స్వంత ఖర్చులతో పెయింటింగ్ పనులు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తమ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నన్ను బాగా ప్రభావితం చేశాయి అన్నారు. సామాజిక బాధ్యతగా తన వంతు సేవ చేయాలనిపించింది.
బడిలో చిన్నారుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చేయగలిగినంత చేయాలి అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమం మాత్రమే కాదు, గతంలో కూడా సత్యనారాయణ విద్యార్థుల అవసరాలను గుర్తించి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు బెంచీలు, బ్లాక్ బోర్డులు అంద చేశారు, విద్యా రంగాన్ని మెరుగుపరచడంలో ఆయన విశేష ఆసక్తి చూపుతుండ డాన్ని గ్రామస్థులు ఎంతో ప్రశంసిస్తున్నారు.
ఈ సందర్భంగా సబ్దల్పూర్ గ్రామస్థులు మాట్లాడుతూ ఇలాంటి నాయకులు ప్రతి గ్రామానికీ అవసరం, రాజకీయ భేదాలు లేకుండా గ్రామ అభివృద్ధికి ముందడుగు వేసే నాయకులు మనకు మార్గదర్శకులు, జిలకర సత్యనారాయణ సేవాప్రవృత్తి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం.
ఇలాంటి మంచి పనులకు ప్రభుత్వం స్థానిక సంస్థలు ప్రోత్సాహం అందించాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి వ్యక్తి భాగస్వామి కావాలన్న సందేశాన్ని ఇవ్వడం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.