14-12-2025 10:09:30 PM
ఒక్క ఓటుతో ఆ గ్రామంలో రాత్రి పది అయినా ముగించని ఎన్నికలు..
ఇద్దరు యువకుల మధ్య పోటాపోటీ..
ఒకే ఒక ఓటుతో అతలాకుతలమవుతున్న అధికారులు..
రికౌంటింగ్ చేయాలంటూ, అధికారులకు పలుమార్లు అభ్యర్థుల వినతి..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటాపోటీగా ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఇద్దరు యువకులు అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ, ఇద్దరు యువకులకు ఒక్క ఓటు తేడాతో ఇద్దరు అధికారులను రికౌంటింగ్ చేయాలంటూ, అధికారులను కోరుతున్నారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి పది గంటల అయినప్పటికీ ఎన్నికలు జరిగి కౌంటింగ్ పూర్తి కాకపోవడం గ్రామస్తులకు ఆందోళన మొదలయింది.
ఒకేసారి యువకులు పోటీలో ఉండడం ఇద్దరికీ ఒకే ఒక్క ఓటుతో తేడా రావడం పట్ల ఇద్దరు యువకులు రికౌంటింగ్ చేయాలంటూ మొండికేస్తున్నారు. 507 సిద్దు స్వామికి, 508 ఓట్లు యధగౌడ్ కు రాగా, ఒక్క ఓటుతో మార్పుకు నాంది పలుకనుందా. ఇక ఫలితం వెల్లడించే పరిస్థితి అధికారుల చేతుల్లోనే ఉంది. గ్రామస్తులు మా గ్రామ సర్పంచ్ ఎవరు అంటూ ఆందోళనగా ఎదురుచూస్తున్నారు.