14-12-2025 10:14:09 PM
7తో సరిపెట్టుకున్న బీఆర్ఎస్..
మునిపల్లి (విజయక్రాంతి): రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో హైద్లాపూర్ గ్రామంలో తలారి రమేష్(బీఆర్ఎస్), మల్లారెడ్డిపేటలో ఈర్లపల్లి రాజు(బీఆర్ఎస్), గొర్రెఘాట్ లో పి. స్వాతి (బీఆర్ఎస్), మొగ్దుంపల్లిలో సరళ(బీఆర్ఎస్), మక్త క్యాసారంలో చాకలి శివలీల(బీఆర్ఎస్), ఖమ్మంపల్లిలో గుజ్జరి ప్రభు దాసు(పాండు) (కాంగ్రెస్), చీలపల్లిలో పట్టోళ్ల విజయలక్ష్మి(కాంగ్రెస్), ఇబ్రహీంపూర్ లో ల్యాగల అశోక్ (కాంగ్రెస్), బోడపల్లిలో గొల్ల అశోక్(కాంగ్రెస్), అల్లాపూర్ లో నారాయణ (కాంగ్రెస్), పిల్లోడిలో డప్పు సువర్ణ(కాంగ్రెస్), పోల్కంపల్లిలో వీరేశం(కాంగ్రెస్), బుసారెడ్డిపల్లిలో హస్నాబాద్ రేణుక(కాంగ్రెస్), పెద్దలోడిలో హనుమంతు రాజు(స్వతంత్ర), బొడ్శట్ పల్లిలో మల్లీశ్వరి(స్వతంత్ర), చిన్నచెల్మెడలో రుద్ర గాయత్రి(కాంగ్రెస్), పెద్ద చెల్మెడలో రాధాబాయి జోషీ(కాంగ్రెస్), బుధేరాలో మల్లేష్ (కాంగ్రెస్), కంకోల్ లో మమత (కాంగ్రెస్), అంతారంలో బి. పవిత్ర(కాంగ్రెస్), తక్కడపల్లిలో మాదిగ ఆనంద్(కాంగ్రెస్), మన్సన్ పల్లిలో శ్రీనివాస్ రెడ్డి(కాంగ్రెస్), కల్లపల్లి బేలూర్ లో గొల్ల నరసమ్మ(కాంగ్రెస్), పెద్దగోపులారం బుడ్డ మల్లేశం(కాంగ్రెస్), గార్లపల్లి ఈశ్వరప్ప(కాంగ్రెస్), తాటిపల్లిలో రాములు(కాంగ్రెస్), మునిపల్లిలో సౌందర్య(కాంగ్రెస్), మల్లికార్జునపల్లిలో బేగరి మల్లేశం(బీఆర్ఎస్), మేళాసంగంలో లక్ష్మి(కాంగ్రెస్), లింగంపల్లిలో ఇర్ఫాన్ పటేల్(బీఆర్ఎస్) లు గెలుపొందారు. కాగా 30 గ్రామ పంచాయతీలకు గాను 7 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచి సరిపెట్టుకోవల్సి వచ్చింది.