రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
17-06-2024 12:25 AM
యాదాద్రి భువనగిరి, జూన్ 16 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందిన ఘటన రాయిగిరిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటకు చెందిన మామిడి సాయికుమార్ ఘట్కేసర్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయికుమార్ మోటార్బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా రాయిగిరి వద్ద వాహనాన్ని తొర్రూరు నుంచి జగద్గిరిగుట్లకు వెళ్తు న్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో సాయికుమార్ తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిపై భువనగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






