calender_icon.png 1 June, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు తోబుట్టువుల పెళ్లి చేసి.. తానూ పెళ్లిచేసుకుంటున్న మహిళ

14-05-2025 12:00:00 AM

పలువురు ఆర్థిక సాయం అందజేత

కామారెడ్డి, మే 13 (విజయక్రాంతి): తల్లిదండ్రులు లేని ముగ్గురు తోబుట్టువులకు పెళ్లిళ్లు పేరంటాలు చేసి  పెళ్లి చేసుకో బోతున్న యువతి ఉదంతమిది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ఓ యువతి పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావడంతో స్థానికులు, నాయకులు ఆమెకు అండగా నిలిచారు. పెళ్లి ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించారు.

జనగామకు చెందిన యువతి బోనగిరి జ్యోతి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మంగళవారం తన పార్టీ అనుచరులతో రూ.20 వేలు సహాయం చేయగా జిల్లాపరిషత్ మాజీ వైస్ చైర్మన్ పరికె  ప్రేమ్ కుమార్ రూ.5వేలు ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో బీబీపేట మండల బీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యదర్శి  శ్రీనివాస్, మాజీ  మార్కెట్ కమిటీ డైరెక్టర్ గొబ్బురి బాపు రెడ్డి పార్టీ గ్రామ అధ్యక్షుడు పాత పండరి,విద్యార్థి నాయకుడు రేగుల సంతోష్, సీనియర్ నాయకులు పర్శ రాములు తదితరులు పాల్గొన్నారు.