calender_icon.png 31 May, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను తక్షణమే అమలు చేయాలి

14-05-2025 12:00:00 AM

తెలంగాణ ఎంప్లాయీస్ కో ఆర్డినేషన్ కమిటీ 

ఖైరతాబాద్, మే 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిటన్సు తక్షణమే అమలు చేయాలని తెలంగాణ  ఎంప్లాయిన్ కోఆర్డినేషన్ కమిటీ సిఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఐదు డిఎలను చెల్లించాలని, పిఆర్సి ప్రకటించాలని కోరింది. రిటై ర్మెంట్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.

మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ మండలి స్పీకర్ స్వామి గౌడ్, దేవి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్య పా త్ర పోషించిన ఉద్యోగులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకం ముందు దోషులుగా చూపిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిరంగంగా వెల్లడిస్తూ రాష్ట్ర పరువును బజారుకీడుస్తున్నారని తెలిపారు.

గత ప్రభుత్వంలో రూ.14 వేల కోట్ల ఆదాయం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను బూచీగా చూపెడుతూ ఆ ఆదాయం ప్రస్తుతం రూ.18 వేల కోట్లకు పెరిగినా స్వీయనియంత్రణ పాటించాలంటూ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చి రాష్ట్రానికి చెడు చేస్తున్న దన్నారు. వెంటనే ఉద్యోగులకు రావాల్సిన 5 డి. ఏ లను వెంటనే చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కొత్త పెన్షన్ విధానం (సిపిఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ పధ్ధతి (ఒపిఎన్)ని అనులు చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల సాధనకు ఉద్యోగులంతా నమిష్టిగా ఒకే వేదికపైకి వచ్చి పోరాడే దిశగా తెలంగాణ ఎంప్లాయీన్కు ఆర్డినేషన్ కమిటీగా ఏర్పడ్డామని తెలిపారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా బహిరంగంగా కాకుండా ఉద్యోగు లతో, మేధావులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.