20-06-2025 12:43:52 AM
అప్పుల బాధ భరించలేక యువకుడు మృతి చెందిన సంఘటన చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో జరిగింది. చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగారపు శ్రీకాంత్(26) తన అవసరం నిమిత్తము అప్పులు చేశాడు.
ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతూ ఉండేవాడు. దీంతో మనస్తాపానికి గురై గురువారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుని తల్లి నాగారపు శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
కొండాపూర్, జూన్ 19: కొండాపూర్ మండల పరిధిలోని మారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కలబ్గూర్ వాస్తవ్యులైన మధుసూదన్ పాఠశాలలో విధులు నిర్వహిస్తుం డగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు.
పాఠశాల తోటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవాడని ఆయన చేసిన సేవలు విద్యార్థులు మరువ లేవని కొనియాడారు. ఉపాధ్యాయుని మృతితో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.