20-11-2025 07:58:01 PM
అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు..
బోథ్ (విజయక్రాంతి): బోథ్ మండలంలోని దన్నూరు (బి) గ్రామానికి చెందిన దూదేకుల కులస్తుడు షేక్ అలీ అయ్యప్ప స్వాములకు అన్నదానం చేసి మతసామరస్యాని చాటుకున్నారు. గత ఆరు సంవత్సరాలుగా అన్నదానం చేస్తూ మతసామారస్యానికి ప్రతీకగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా షేక్ అలీ మాట్లాడుతూ రంజాన్ పండుగను ఎంత పవిత్రంగా కఠోర ఉపవాసాలతో జరుపుకుంటామో అలాగే అంతే కఠోర దీక్షతో అయ్యప్ప స్వాములు 41 రోజుల పాటు కఠిన నియమాలతో ఉంటారని పేర్కొన్నారు.
ఎటువంటి భేదభావ్యం లేకుండా అన్ని పండుగలను కుల,మతాలకతీతంగా ఐక్యమత్యంతో కలిసి జరుపుకోవాలని కోరారు. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేయడం తనకు ఎంతో ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. ఆ స్వామి ఆశీస్సులతో సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి బద్దం రమణారెడ్డి, అరుణ్ రెడ్డి, సందీప్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, విజయ్ రెడ్డి, జైపాల్ రెడ్డి,అమరేందర్ రెడ్డి, సంతోష్, రమేష్, భోజన్న, స్నేహిత్ రెడ్డి పురుషోత్తం, నాగార్జున, తదితరులు పాల్గొన్నారు