calender_icon.png 22 November, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలో పోలీసులను కోరిన యువతి

09-02-2025 08:09:59 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని మెడికల్ కాలనీకి చెందిన భరణి వెంకట కార్తీక్ అనే యువ న్యాయవాది తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆ యువతిని తానేనని ఎట్టకేలకు బాధితురాలు అయిన యువతి ఆదివారం సాయంత్రం ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. వీడియో ద్వారా తనకు కార్తీక్ తో పరిచయం ఎలా ఏర్పడింది, తనను కార్తీక్ పెళ్లి చేసుకుంటానని ఎలా మోసం చేసాడు, తదుపరిగా యువతి జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసి జరిగిన విషయాన్ని వివరించినట్లుగా తెలిపింది. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం భద్రాచలం టౌన్ పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని తెలియజేసానని, అనంతరం కార్తిక్ ను టౌన్ పోలీసులు స్టేషన్ కి పిలిపించి జరిగిన విషయంపై వివరణ కోరారని ఇరువర్గాలు మాట్లాడుకొని విషయాన్ని సెటిల్ చేసుకోవాలని టౌన్ సీఐ తెలిపారు.

పోలీసులు విషయాన్ని సెటిల్ చేసుకోమని చెప్పినప్పటికి కార్తిక్ అందుకు భిన్నంగా వ్యవహారిస్తూ ముందేమో పెళ్లి చేసుకుంటానని చెప్పి, మొహం చాటేసి పెళ్లి చేసుకోను. నీకు ఇష్టం వచ్చింది చేసుకో అని కార్తిక్ తెగించి చెప్పాడని, అందుకే తాను కూడా విసిగిపోయి టౌన్ పోలీస్ స్టేషన్ లో కార్తిక్ పై ఫిర్యాదు చేశానని తెలిపారు. అదే రోజు పోలీసులు కేసు నమోదు చేసారని, కాగా ఈ విషయం తెలుసుకున్న కార్తిక్ పరరాయ్యాడని, వీలైనంత త్వరగా పోలీసులు కార్తిక్ ను పట్టుకొని తనకు న్యాయం చేయాలంటూ తాను విడుదల చేసిన వీడియోలో తన బాధను, ఆవేదనను తెలిపారు.