17-06-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఆమనగల్లు, 16: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం ఫార్ములా రేసును తెరపైకి తీసుకువచ్చారని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో కల్వకుర్తి నియోజకవర్గం కు చెందిన పలువురు పార్టీ నాయకులతో తరలివచ్చి కేటీఆర్ కు ఆయన సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాలను పక్కకు పెట్టి... ఆరుగ్యారంటీలను హామీలను హామలు చేయకుండా అటెన్షన్ డ్రైవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఫార్ములా రేస్ లో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగకుండా రాజకీయంగా కెసిఆర్ కుటుంబంను ఇబ్బందులు గురి చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు.
చట్ట ప్రకారమే ఏసీబీ కేసులను బీ ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుర్కొంటారని... పార్టీ అంతా అండగా ఉంటామని ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో కల్వకుర్తి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మసత్యం, మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్,మాజీ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అర్జున్ రావు మాజీ ఎంపీపీ జైపాల్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్,బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు వరుణ్ పాల్గొన్నారు.