16-06-2025 11:43:57 PM
హనుమకొండ (విజయక్రాంతి): డిప్లమా చివరి సంవత్సరం పూర్తయిన విద్యార్థులకు ఎస్వీఎస్ కాలేజీ(SVS College) యజమాన్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత మూడు సంవత్సరాలు విద్యను అభ్యసించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వడానికి కాలేజీ యజమాన్యం ఫీజు రియంబర్స్మెంట్ కాలేదని విద్యార్థులను ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని ఒత్తిడి చేస్తుంది.
పేద మధ్యతరగతి పిల్లలపై ప్రభావం చూపే ఇలాంటి కాలేజీ యజమాన్యం చేసే తీరును విద్యార్థులు కలెక్టర్ కు వివరించడం జరిగింది. బుధవారం నుండి కౌన్సిలింగ్ ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీ యజమాన్యం ఇవ్వకపోవడం లాంటి విషయాలకు విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వాలని, ఎస్వీఎస్ కాలేజీకి యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.