calender_icon.png 29 June, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అధికారులకు ఏసీబీ వల

29-06-2025 12:52:47 AM

సుల్తానాబాద్ మున్సిపల్ ఆఫీస్, హుజూర్‌నగర్ ఎమ్మార్వో కార్యాలయంలో ఘటనలు 

మంథని/ సూర్యాపేట, జూన్ 28(విజ యక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నెంబ ర్ కోసం ప్రసాద్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకోగా, మున్సిపల్ ఉద్యోగులు వినోద్, విజ య్ రూ. 5వేలు లంచం అడిగారు. దీంతో ప్రసాద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించా డు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం లో వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

హుజూర్‌నగర్ మండలం కరక్కాయలగూడెంకు చెందిన తోట రాంబాబు తన తండ్రి పేరిట ఉన్న 12 ఎకరాల వ్యవసాయ భూమి ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొనేందు కు యత్నించగా, ధరణి ఆపరేటర్ విజేతరెడ్డి రూ. 20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీం తో అతడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం ధరణి ఆపరేటర్ విజేతరెడ్డి రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా నల్లగొండ ఏసీబీ రేంజ్ అధికారి జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.