calender_icon.png 28 June, 2025 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ మేళాతో వృత్తివిద్య విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు

28-06-2025 12:00:00 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, జూన్ 27 (విజయ క్రాంతి): డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్రం, ఆర్డిఎస్డియు తెలంగాణ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2022 - 25 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఒకేషనల్ కోర్సులలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల హనుమకొండ ప్రాంగణంలో అప్రెంటిస్ట్ జాబ్ మేళా 2025ను నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్రీధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్ స్థాయిలోనే విద్యార్థిని, విద్యార్థులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి ఇలాంటి జాబ్ మేళలు ఎంతగానో దోహదపడతాయని, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నైపుణ్యాల అభివృద్ధికి ఉపాధికి కల్పనలకు సద్వినియోగం చేసుకోవాలని, ఉజ్వల భవిష్యత్తును నిర్మాణం చేసుకోవాలని జాబ్ మేళాలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా హనుమకొండ జిల్లా ఇంటర్ విద్యాధికారి పి.గోపాల్, ఎం.చందర్, ప్రిన్సిపాల్ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ వరంగల్ ప్రత్యేక ఆహ్వానితులుగా కే. మాధవరావు, నోడల్ ఆఫీసర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరంగల్ ప్రిన్సిపాల్ రెబ్బ శ్రీనివాస్ రావు, కే. సంపత్ కుమార్, ఏ. శ్రీనివాస్ రెడ్డి, భగవద్గీత, ఎం. శరుద్రుతి, రాజిరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్  శ్రీనివాస్, డాక్టర్ ఆర్. ప్రవీణ్ కుమార్, ప్రభుత్వ ప్రైవేటు కార్పోరేటర్ సంస్థల ప్రతినిధులు అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.