14-06-2025 05:12:44 PM
సామరస్య పూర్వకంగా పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్ చరిత్రలో ఇంత పెద్ద క్లైమ్ చేయడం ఇదే మొదటి సారి
కామారెడ్డి (విజయక్రాంతి): జాతీయ లోక్ అదాలత్(Lok Adalat)లో మొదటిసారి కామారెడ్డి కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో రూ.1.40కోట్ల ఇన్సూరెన్స్ పాలసీ క్లేమ్ సెటిల్మెంట్ చేశారు. ఈ సంఘటన జాతీయోపదల చరిత్రలోనే మొదటిసారి అని న్యాయ వాదులు తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ కామారెడ్డి జిల్లా తాడువాయిలో ఉద్యోగరీత్యా కారులో వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబం శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ సహా పలువురు ప్రతివాదులపై కోర్టులో క్లైమ్ దాఖలు చేశారు.
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (ఎం ఏ సి టి), జిల్లా కోర్టును న్యాయవాదులు టి దేవరాజ్ గౌడ్, నంద రమేష్, జె పి శ్రావణ్ గౌడ్ ద్వారా ఆశ్రయించి రెండు కోట్ల పరిహారం కోరారు. మధ్యవర్తిత్వం, పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సౌజన్యంతో చేపట్టిన చర్చలు సమన్వయ కృషి ఫలితంగా రెండు పక్షాలు ఒక సామరస్యపూరిత ఒప్పందానికి వచ్చాయి. ఇందులో ప్రతివాదులు రూ.1.40 కోట్లను పరిహారంగా చెల్లించేందుకు అంగీకరించారు. శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలకు లో కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ( డి.ఎల్.ఎస్.ఏ) ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు కోట్ల విలువైన ఒక మోటార్ యాక్సిడెంట్ క్లేమ్ కేసు సామరస్య పూరితంగా పరిష్కరించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ వరప్రసాద్ ఈ కేసులో పాత్ర వహించిన న్యాయవాదులను సహకరించిన ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులను అభినందించారు.
ఈ పరిష్కారం ద్వారా బాధిత కుటుంబానికి సకాలంలో న్యాయం లభించడమే కాక ప్రజలకు సత్వర, సరళమైన న్యాయాన్ని అందించడంలో లోకదాలత్ వ్యవస్థ ఎంతో ప్రభావవంతంగా ఉందో స్పష్టం చేసినట్లయి0ది. కామారెడ్డి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రజలందరినీ తమ వివాదాలను జాతీయ లోక్దాలత్ వేదికగా త్వరితగతిన తక్కువ ఖర్చుతో పరిష్కరించు కునేలా ప్రోత్సహిస్తుందని వారు తెలిపారు. తక్కువ సమయంలో కేసును రాజీ కుదిరించడంలో న్యాయవాదులు చూపిన చొరవను న్యాయమూర్తి వరప్రసాద్ అభినందించారు. జాతీయ లోక్ అదాలత్ లో ఇంత పెద్ద మొత్తంలోని పరిహారం కేసును రాజీకుదురుచడం చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్పు వెలువరించి రాజీ కుదిరించారని న్యాయవాదులు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి సత్వరంగా న్యాయం జరిగినట్లు వారు తెలిపారు.