calender_icon.png 15 June, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్నూరు కాపు కుల కార్పొరేషన్ కోసం కృషి చేస్తా...

14-06-2025 05:22:17 PM

రేణుక చౌదరికి రుణపడి ఉంటా...

మున్నూరు కాపు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు...

వైరా (విజయక్రాంతి): మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ ఏర్పాటుకై  తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు(TPCC General Secretary Katla Ranga Rao) పేర్కొన్నారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు నందు రేచర్ల బజార్ వద్ద ఏర్పాటు చేసిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు శనివారం వైరాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్ల రంగారావు ఇటీవల పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా  ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అనంతర  రంగారావును ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కట్ల రంగారావు మాట్లాడుతూ... పిసిసి ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో కాపు కులస్తులకు ఒకే ఒక్క పదవి లభించిందని, ఆ అదృష్టం నాకు దక్కిందని.. ఈ పదవి నియామకానికి ఎంతో  కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి కూడా తనకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

పార్టీ, ప్రభుత్వ పెద్దలు కేంద్ర మాజీ మంత్రివర్యులు రేణుక చౌదరి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని కట్ల రంగారావు సన్మాన కార్యక్రమం సభలో పేర్కొన్నారు. తన రాజకీయ జీవితం 35 సంవత్సరములో నేను ఏ హోదాలో పనిచేసిన మున్నూరు కాపులు నా రాజకీయ జీవిత ఎదుగుదల్లో ఎంతో కృషి చేశారని రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మున్నూరు కాపులకు కూడా టికెట్లు దక్కే విధంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వారికి మాటిచ్చారు. సన్మాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళ లు పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సన్మాన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. ముల్లపాటి సీతారాములు, రేచర్ల నాగేశ్వరరావు, రేచర్ల రాముడు, కట్ల నాగరాజు, కామిశెట్టి రవికుమార్, కట్ల సంతోష్, దాసరాజు కుటుంబరావు, య న్నం.నాగేందర్రావు, రేచర్ల పుల్లయ్య,వీరంశెట్టి సీతారాములు, మూల దుర్గాప్రసాద్, ముదిగొండ్ల మహేష్, ఆది శ్రీకాంత్, అక్కిశెట్టి రవితేజ, మట్టపల్లి సైదులు, దండ్యాల నరసింహారావు, రేచర్ల అసత్యం, రేచర్ల వెంకటేష్, పుప్పాల.అనంతరామయ్య, పుప్పాల సైదులు, పాలెపు సైదులు, రేచర్ల ప్రభాకర్, రేచర్ల రాము, శీలం ప్రభాకర్, కంభం పాటి. సత్యనారాయణ, రేచర్ల కారు విశ్వనాథం, రేచర్ల సైదులు, రేచర్ల చిన్న విశ్వనాథం, ఆర్ వి, రేచర్ల జనార్ధన్, నవీన్, రేచర్ల వెంకటేశ్వర్లు, కరెంటు రామారావు, పెద్ద ఎత్తున మున్నూరు కాపు మహిళలు పాల్గొన్నారు.