31-05-2025 12:13:46 AM
24 గంటల్లో హత్య కేసు చేధించిన పోలీసులు, తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్
తూప్రాన్, మే 30 : మద్యం మత్తులో స్నేహితున్ని హత్య చేసి పారిపోయిన నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ లోని ఎస్ఎల్ఎల్సిపి కంపెనీలో బతుకుతెరువు నిమిత్తం పనిచేస్తున్నటువంటి కేరళ రాష్ట్రానికి చెందిన నలీన్ అనే వ్యక్తిని బండ్లగూడ నరేష్ కుమార్ తాగిన మైకంలో గొడవలో కొట్టి వేయడంతో నలీన్ అనే వ్యక్తి కిందపడి తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయినట్లు తెలిపారు.
ఈ ఘటనలో రెండవ వ్యక్తి నరేష్ కుమార్ పరారీలో ఉండగా చాకచక్యంగా తూప్రాన్ సిఐ రంగాకృష్ణ, మనోహరబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, పోలీస్ సిబ్బంది కలిసి పరారీలో ఉన్న నిందితున్నిసాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకొని శుక్రవారం రోజున అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లో పరారీలో ఉన్న హంతకుని పట్టుకున్న సిఐ రంగాకృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్, పోలీస్ సిబ్బందిని అభినందించారు.