31-05-2025 12:13:39 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): గ్రామ పరిపాలన అధికారుల నియామకానికి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన అర్హత రాత పరీక్షకు 130 మంది హాజరు కాగా 110 మంది అర్హత సాధించారని అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి తెలిపారు. గ్రామ పరిపాలనాధికారి పోస్టులకు అర్హత సాధించిన వారికి 103 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమం శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినట్లు చెప్పారు. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రాగానే వారిని గ్రామాలకు కేటాయిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రేట్ పాలనాధికారి పవన్ కుమార్, సూపరిండెంట్ మదన్ గోపాల్ పాల్గొన్నారు.