31-05-2025 12:14:42 AM
పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, మే 30 (విజయ క్రాంతి ):నకిలీ పత్తి విత్తనాల తయారీ కేంద్రంపై పోలీసు, వ్యవసాయ శాఖ అధికారుల సంయుక్తంగా దాడులు చేసి మూడు వేర్వేరు కేసుల్లో రూ 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టుకున్నట్లు ఖమ్మం పోలీస్ కమి షనర్ సునీల్ దత్ తెలిపారు.శుక్రవారం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూప్రభుత్వ ఆదేశానుసా రం ఈ దాడులు నిర్వహించమన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు చెప్పా రు. కుటీర పరిశ్రమలాగా నకిలీ ప్రత్తి విత్తనములు తయారు చేస్తున్న స్థావరంపై దాడి చేసి పట్టుకున్నామన్నారు.ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తం గా ఉండాలన్నారు. తక్కువ ధరలకు తెలియ ని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోవదన్నారు.మార్కెట్లో నకిలీ విత్తనాల విక్ర యం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృం దాల పర్యవేక్షణ వుంటుందని తెలిపారు.