14-06-2025 12:57:57 AM
భద్రాచలంలో జరిగిన హత్య కేసులో మరో 12 మంది నిందితుల అరెస్టు
వివరాలు వెల్లడించిన ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం ఏఎస్ఆర్ కాలనీలో జూన్ 7వ తేదీన కంచి సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన గుంజా సాయిరాంను అరెస్ట్ చేయగా 12 మంది నిందితులను శుక్రవారం పట్టుకొని అరెస్ట్ చేసినట్లు భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ హత్య చేసి పరారీ అయిన నిందితుల్లో 12 మందినీ అరెస్టు చేశామని, మిగిలిన ముద్దాయిల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని కూడా ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన వారిలో ఎం. మోహినుద్దీన్, మోటుపల్లి కామేష్, పల్లెపు సాంబ, పల్లెపు దుర్గాప్రసాద్, గుండి రాకేష్, గుంజ గోపీచంద్, గొల్ల గణేష్, చెంచాలపు రాహుల్ తేజ, బానోత్ మధు, చల్లా అజయ్, మోతుకూరు సాయి, గుంజా వెంకటేష్ ఉన్నట్లు తెలిపారు. ఈ సమాజంలో సీఐ నాగరాజు తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.