14-06-2025 12:57:25 AM
మునిపల్లి, జూన్ 13 : రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని తహసీల్దార్ గంగా భవాని అన్నారు. శుక్రవారం నాడు మండల పరిధిలోని పెద్ద గోపులారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు తాజా మాజీ ఎంపీటీసీ పాండు, గ్రామస్తులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఈనెల 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. భూ రికార్డులో భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువులోపు సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఇందుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందన్నారు. అందుకు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపిటిసి పాండు, ఆర్ఐ సుభాష్, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.