14-06-2025 12:58:41 AM
మెదక్, జూన్ 13(విజయక్రాంతి): మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమను నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా డి. వి. శ్రీనివాస రావు శుక్రవారం కోర్టు కార్యాలయంలో పూల మొక్క అందించి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
అనంతరం జిల్లాలో నేరాల న మోదు, దర్యాప్తు, కోర్టు కేలండర్ నెంబర్, కేసు ట్రయల్స్ లోక్ అదాలత్ నిర్వహణ, కేసులలో నేరస్తులకు శిక్షల అమలు తదితర అంశాల గురించి చర్చించారు. కోర్టు అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి త్వరితగతిన కేసుల పరిష్కారం చూపాలని జడ్జి అన్నారు.