11-10-2025 02:36:56 PM
రామగిరి మండలంలో హత్య కేసులో నిందితుల అరెస్ట్
24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలింపు
విలేకరుల సమావేశంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్
రామగిరి, (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సంచలనం రేపిన హత్య కేసులో నిందితులను 24 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్న మని గోదావరిఖని ఏసిపి మడత రమేష్ శనివారం వెల్లడించారు. మృతుడు కోట చిరంజీవి రాజయ్య (35) కులం ఎస్సీ నేతకాని, గ్రామం. న్యూ మారేడుపాక అని అతనిని పెంచికలపేటకు చెందిన పొలవైన సంధ్యారాణి భర్త కుమార్, (34), అనవేనా మల్లయ్య, (62), అనవేన నరేష్, (37), పొలవెన కుమార్, (36), పిడుగు చందు, (26) సెంటీనరి కాలనీ లో వీరు చిరంజీవి ని శుక్రవారం హత్యచేసి పారిపోతుండగా వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు బైక్ లు, హత్య కు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. శుక్రవారం 10వ తేదిన మృతుడు కోట చిరంజీవి తమ్ముడైన కోటా రామ్ ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, సీపీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు లో భాగంగా హత్య కు పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో మంథని సీఐ రాజు, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, రామగిరి ఎస్ ఐ లు టి. శ్రీనివాస్, పి. దివ్య కమాన్ పూర్ ఎస్ఐ ప్రసాద్, ముత్తారం ఎస్ఐ రవి కుమార్, సిబ్బంది పెంచికల్ పేట్ ఎక్స్ రోడ్ వద్ద ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు
ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర గల మోటార్ సైకిల్ పై వెళ్తుండగా పట్టుకొని వారిని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి, అరెస్ట్ చేసి శనివారం రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఏసీపీ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం మృతుడు కోట చిరంజీవి పోతన కాలనీలో మీ సేవా సెంటర్ ని నడుపుకుంటూ జీవిస్తాడని, ఇతని భార్య 2019లో చనిపోయందని, నిందితురాలు ఒకరోజు పని నిమిత్తం పోతన కాలంలోని మీ సేవకు వెళ్ళినప్పుడు చిరంజీవిని కలిసిందని, అప్పటి నుంచి నిందితురాలికి చిరంజీవి కాల్స్, మెసేజ్ చేసేవాడని, ఆ క్రమంలో మృతుడు నిందితురాలు అంటే ఇష్టమని తనతో ఉంటానని చెప్పి ఒప్పుకొక పోతే చంపుతానని బెదిరించడంతో నిందితురాలు భయపడి అతనితో మాట్లాడేదని, కొంతకాలం తర్వాత అతనితో మాట్లాడక పోవడం, అతని దూరం పెట్టడం చేయడంతో నిందితురాలని, తన భర్తని, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించేవాడని, రెండు నెలల క్రితం మృతుడు చిరంజీవి వేధింపులు భరించలేక నిందితురాలు తన భర్తకు విషయం తెలిపిందని, మృతుడు నిందితురాలు భర్తకు ఫోన్ చేసి నిన్ను నీ భార్యని చంపుతానని, మీ పరువు తీస్తా అంటూ బెదిరించేవాడని, నెల రోజుల క్రితం ఊరు లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించారని, అయినా మృతుడు చిరంజీవి ప్రవర్తనలో మార్పు రాక పోగా నిందితురాలి ఊరు లో అందరితో తన గురించి చెడుగా చెప్తూ పెళ్లి చేసుకున్నానని, అతనితో లేచిపోయిందని చెడుగా చెప్పేవాడని, శుక్రవారం 10 వ తేదీన నిందితురాలు పనిచేసే సెంటినరీ కాలనీ సమైక్య కార్యాలయం వద్దకు చిరంజీవి రావడంతో సంధ్య రాణి భయపడి తన భర్తకు అన్నయ్య కు ఫోన్ చేసి రమ్మనీ చిరంజీవి ఎంత చెప్పినా వినకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఎలాగైనా అతని చంపాలని నిందితురాలు అన్న, నాన్న, భర్తతో చెప్పిందని, చిరంజీవి ఆఫీస్ వద్దకి వచ్చి నిందితురాలి తో గొడవ పడుతుండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితురాలి అన్న, భర్త, తండ్రి బావమరిది చిరంజీవితో గొడవపడి చేతులతో కొట్టి చిరంజీవిని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో నిందితురాలు తండ్రి తనతో తీసుకువచ్చిన ఇనుపరాడు, చాకుతో గాయపరచగా, అన్న, బావమరిది అతని గట్టిగా పట్టుకున్నారని, నిందితురాలి తండ్రి చిరంజీవిని చంపాలని ఉద్దేశంతో రాడుతో చాలాసార్లు చిరంజీవి తలపై కొట్టడంతో తలపై బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడని ఏసీపీ తెలిపారు.