calender_icon.png 14 June, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కేసులో నిందితులు రిమాండ్

14-06-2025 12:24:08 AM

ఘట్ కేసర్: గంజాయి కేసులో ప్రధాన నిందితుడితో పాటు అతని అనుచరులను ఘట్ కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రవి తెలిపిన వివరాల ప్రకారం ఘట్ కేసర్ ఎక్సైజ్  పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు. చెంగిచర్ల చెరువు సమీపంలో సఫిల్ గూడకు చెందిన వేముల జాన్ బనియన్ ఆలియాస్ జాన్ (29), ఈసీఐఎల్ కమలానగర్ కు చెందిన అథవ మోహన్ వెంకట్ (29), చెంగిచర్లకు చెందిన మనీష్ ఉపాధ్యాయ్ (26), మౌలాలికి చెందిన జూపల్లి రవితేజ (27), దాసరి విశాల్ (21) గంజాయి సరఫరా చేస్తూ పోలీసులకు చిక్కారు.

వీరి వద్ద లభించిన 10.440 కిలోల ఎండు గంజాయి, కారు, బైక్, ఐదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లా, సుంకి గ్రామంలో జైన్ మామా నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు వేముల జాన్ బనియన్ విచారణలో ఒప్పుకున్నాడు. అక్కడ నుండి గంజాయిని రైలులో హైదరాబాద్ లోని సఫిల్ గూడకు తీసుకొచ్చి కారు ద్వారా పంపిణీ చేసి మనీష్, విశాల్, మోహన్ వెంకట్, జూపల్లి రవితేజలకు అప్పగించాడు. మనీష్, విశాల్ చెంగిచర్ల ప్రాంతంలో గంజాయిని విక్రయిస్తున్నారు. మోహన్ వెంకట్ సఫిల్ గూడలో జూపల్లి రవితేజ రాంపల్లిలో అమ్ముతున్నారు. 15 గ్రాముల ప్యాకెట్ ను రూ.1000 చొప్పున విక్రయించి, లాభంలో 10 శాతం తీసుకుంటాడు. జాన్ బనియన్ సాధారణ నేరస్థుడు. గతంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. ముద్దాయిలపై పోలీసులు కేసు నమోదు చేసి కోర్టు ద్వారా వారిని రిమాండ్ చేశారు.