14-06-2025 12:24:39 AM
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
బూర్గంపాడు,జూన్13(విజయక్రాంతి):రైతుల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం బూర్గంపాడు మండలం పినపాక పట్టి నగర్ గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో ఎ మ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రైతుల ఇబ్బం దులు తొలగించడానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. భూభారతితో నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. చట్టంలో పొందుపరిచిన అంశాలను రై తులు తెలుసుకోవాలన్నారు.భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
రెవెన్యూ సదస్సులకు హాజరు కాలేని రైతులు నేరుగా తహసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అనంతరం ఇం దిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శిరీష ,ఎంపీడీవో జమలారెడ్డి, డిటీ రామ్ నరేష్,ఎంపీఓ బాలయ్య,ఎంఈఓ యదు సింహరాజు,ఆర్ఐ నరసింహారావు,పంచాయతీ కార్యదర్శి విజయ్, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, మహిళా నాయకురాలు బర్ల నాగమణి,సుగుణ,మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి,నాయకులు కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,భజన సతీష్,రాంబాబు,నాగేంద్ర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.