14-06-2025 12:23:26 AM
మాజీమంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ రెడ్డి దర్యాప్తు సంస్థలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారనడానికి కేటీఆర్కు ఇచ్చిన తాజా నోటీసులే నిద ర్శనమని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి న ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయాలని నిరంతరం ప్రశ్నిస్తున్న కేటీఆర్ నైతిక స్థుర్యైన్ని దెబ్బతీసేందుకే రేవంత్ రెడ్డి ఈ నోటీసులు పంపించారని అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 18 నెలల పాలన లో డైవర్షన్ పాలిటిక్స్ను అమలు చేస్తూ బీఆర్ఎస్ను బద్నామ్ చేసేందుకు ప్రయత్నిస్తు న్నారని విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం గెలిచే ప్రసక్తే లేదు రేవంత్ డ్డి డ్రామా, డైవెర్షన్ రాజకీయాలు ఇప్పటికే రాష్ర్ట ప్రజలకు అర్థమయ్యాయన్నారు. ఫార్ములా ఈ రేసింగ్తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని.. పెట్టుబడులు కూడా వచ్చాయన్నారు.
తెలంగాణ ప్రతిష్ట పెంచినందుకా కేటీఆర్పై మీ నోటిసుల ప్రతాపం అని ప్రశ్నించారు. 2000లో చంద్రబాబు ఫార్ములా వన్ కోసం కృషి చేసి నిర్వహించలేకపోయారని.. అలాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ కృషి వల్ల ఫార్ములా వన్ వంటి ప్రతిష్టాత్మక రేస్ ను దేశానికి అందులోనూ హైదరాబాద్ కి తీసుకొని వచ్చారని తెలిపారు.