18 April, 2026 | 6:02 PM

ఇసుక అక్రమ రవాణాపై చర్యలు

05-04-2025 01:34 AM

డీఎస్పీ పార్థసారధి

నాగారం , ఏప్రిల్ 4 :  ఇసుక అక్రమ రవాణా జరపకుండా పోలీసులు తనిఖీ చేసి అక్రమార్కులపై తక్షణ చర్యలు తీసుకోవాలని   డీఎస్పీ  పార్థసారథి అని అన్నారు. నాగారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను శుక్రవారం  డీఎస్పీ పార్థసారథి   సిఐ రఘువీర్ రెడ్డితో కలిసి సందర్శించారు.

అనంతరం పలు రికార్డును , స్టేషన్ రికార్డులను నేరాల నమోదు  కేసుల స్థితిగతులను  కోర్టు క్యాలెండర్ సాంకేతికత  పరిశీలించి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. 

అక్రమ రవాణా  అసాంఘిక కార్యకలాపాలను నిరోధించాలన్నారు. అనంతరం  ఎస్త్స్ర ఐలయ్య పుష్పగుచ్చం అందజేశారు.  ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.