14-06-2025 12:00:00 AM
ప్రభుత్వానికి వేంపల్లి గ్రామస్థుల విజ్ఞప్తి
ఖైరతాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకుడిని అని చెప్పుకుంటూ భూకబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తి కఠిన చర్యలు తీసుకోని,తమ భూమిని తమకు ఇప్పించాలని అదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వేంపల్లి గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేర కు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు అబ్దుల్ జబ్బర్, ముప్పిడి భాస్కర్, మల్లేష్ లు తమ గోడును మీడియా ముందు వెళ్లబోసుకున్నారు.
తమ గ్రామానికి చెం దిన ఈర్త సత్యనారాయణ అనే వ్యక్తి స్థానికంగా రాజకీయ నేతగా చలామణి అవుతూ ప్రభుత్వ అధికారులను చేతిలో పెట్టుకొని అందిన కాడికి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించా రు.
తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూములను సత్యనారాయణ తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి స్వాధీనం చేసుకున్నాడని కన్నీరు పెట్టుకున్నారు.ఈ విషయంపై ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. పేదల భూములపై కన్నేసి కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి తమ భూములను తమకు ఇప్పించి తమకు న్యాయం చేయాలని కోరారు.