14-06-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, జూన్ 1౩: నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు అడ్డగోలుగా నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. గండిపేట మండలం నార్సింగి మున్సిపల్ పరిధిలోని వట్టినాగులపల్లి గ్రామం మొత్తం 111 జీవో పరిధిలో ఉంది.
నిబంధన ప్రకారం ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. నిబంధన ఇది మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ అధికారులకు వరంగా మారింది. అక్రమ నిర్మాణదారుల నుంచి ఒక్కో భవనానికి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
టౌన్ ప్లానింగ్ అధికారుల పూర్తి సహకారం
అనుమతులు లేకుండా భారీ ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తు న్నారు. జీవో 111 పరిధిలో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటిస్తూ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలను తుం గలో తొక్కుతూ అక్రమంగా, అనుమతులు లేకుండా లేకుండా నిర్మిస్తున్న భవనాల యజమానులకు పూర్తిస్థాయిలో నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సహకరిస్తున్నారు.
అంతా అధికారుల కను సన్నల్లోనే అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా తమ కేమీ పట్టనట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరించడం గమనార్హం. ఇప్పటికైనా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చర్యలు తీసుకుంటాం
మున్సిపల్ పరిధిలోని వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలు చేపడు తున్నారనే విషయం నా దృష్టికి రాలేదు. సిబ్బందిని క్షేత్రస్థాయిలోకి పంపించి పరిశీలించి చర్యలు తీసుకుంటాం. వట్టినాగులపల్లి గ్రామం 111 జీవో పరిధిలో ఉంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..
మణిహారిక, నార్సింగి టౌన్ ప్లానింగ్ అధికారిణి