30-06-2025 06:57:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని తొమ్మిదో వార్డులో టీఆర్ఎస్ గద్దెను కూలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలని ఆ పార్టీ నేతలు సోమవారం పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్(CI Praveen Kumar)కు ఫిర్యాదు చేశారు. వెంటనే సీఐ అక్కడికి చేరుకొని టీఆర్ఎస్ గద్దెను కూలగొట్టిన అంశంపై విచారణ నిర్వహిస్తున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను త్వరలో గుర్తిస్తామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మైనార్టీ టీఆర్ఎస్ నేతలు మసూద్ ఖాన్ మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.